టెస్టులు పెంచాలన్న హైకోర్టును కూడా బీజేపీ కోర్టు అంటరా?

టెస్టులు పెంచాలన్న హైకోర్టును కూడా బీజేపీ కోర్టు అంటరా?

గవర్నర్ పై అధికార పార్టీ నేతల విమర్శలు సరికాదని.. మంచి సూచనలు చేస్తే తప్పుపడతారా అని బీజేపీ రాష్ట్ర నేతలు మండిపడ్డారు. కరోనా కట్టడిలో సర్కారు ఫెయిలైందని.. డాక్టర్ అయిన గవర్నర్ తమిళిసై చేసిన సూచనలనూ పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు పెంచాలని హైకోర్టు చాలాసార్లు ఆదేశించిందని.. మరి హైకోర్టును కూడా బీజేపీ కోర్టు అంటరా అని ప్రశ్నించారు. గవర్నర్కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు. మంగళవారం బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు తదితరులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. గవర్నర్ పై టీఆర్ఎస్ఎమ్మెల్యే, సోషల్మీడియా కార్యకర్తలు చేసిన విమర్శలను ఖండించారు.

హైకోర్టు ఆ మాటే చెప్పింది: రాంచందర్ రావు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసిన కామెంట్స్ ఆయన అభిప్రాయమా, పార్టీ అభిప్రాయమా చెప్పాలని ఎమ్మెల్సీ రాంచందర్ రావు డిమాండ్ చేశారు. కరోనా విషయంలో గవర్నరే కాదు.. హైకోర్టు కూడా కేసీఆర్ సర్కారుకు మొట్టికాయలు వేసిందని.. అలాంటప్పుడు హైకోర్టును బీజేపీ కోర్టుఅంటారా అని నిలదీశారు. తమిళిసై సూచనలను రాష్ట్ర సర్కారు, టీఆర్ఎస్ నేతలు ఎందుకు పాజిటివ్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

సిగ్గు తెచ్చుకోవాలి: కృష్ణ సాగర్ రావు

కరోనా కట్టడిలో ఫెయిలైన కేసీఆర్ సర్కారుకు గవర్నర్ చీవాట్లుపెట్టడాన్ని స్వాగతిస్తున్నామ ని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ సర్కారు సిగ్గు తెచ్చుకోవాలని సూచించారు. డాక్టర్ అయిన గవర్నర్.. రాష్ట్ర సర్కారు సరిగా వ్యవహరించకపోవడాన్ని ఎత్తిచూపారని చెప్పారు. కరోనా విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని గవ ర్నర్ పలుమార్లు సూచించినా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు.

సీఎంకు మహిళలంటే చిన్నచూపు: రజని

ఎమ్మెల్యే సైదిరెడ్డి గవర్నర్ పై విమర్శలు చేయడం సహించరానిదని బీజేపీ అధికార ప్రతి నిధి పాల్వాయి రజని అన్నారు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కారు ఫెయిలైన తీరుపై స్పందించిన గవర్నర్పై విమర్శలు చేయడమేంటని ప్రశ్నిం చారు. సైదిరెడ్డి క్షమాపణలు చెప్పాలనిడిమాండ్ చేశారు. సీఎంకు మహిళలు అంటేనే చిన్న చూపు అని.. అందుకే గవర్నర్ పదవిలో మహిళ ఉంటే జీరించుకోలేకపోతున్నారని ఆరోపించారు.

సైదిరెడ్డిని సస్పెండ్ చేయాలి: పొంగులేటి సుధాకర్ రెడ్డి

గవర్నర్పై తప్పుగా కామెంట్ చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని సస్పెండ్ చేయాలని, దీనిపై సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా కంట్రోల్లో ఫెయిలైన టీఆర్ఎస్ సర్కారు.. తన తప్పులను సరిచేసుకోవాల్సింది పోయి గవర్నర్ ను టార్గెట్ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఒక డాక్టర్ గా గవర్నర్ విలువైన సూచనలు చేశారని, సర్కారు వాటిని పాటించాలని సూచించారు.