
తాను స్టార్ట్ చేయబోయే నిజం ఛానెల్ ముఖ్య ఉద్దేశం అబద్దాల బట్టలు ఊడదీయడం అంటూ కాంట్రవర్శియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. అబద్దం బట్టలు విప్పి బయట పారేస్తేనే.. నిజం అసలు నగ్న సత్యం మనకు కనిపిస్తుందని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. నిజం చంపేదే ఎప్పుడూ నిజాన్ని చంపడం కోసం. కానీ నిజం ఎప్పుడూ చావదు. అప్పుడప్పుడూ చచ్చిపోయినట్టు అనిపిస్తుందన్నారు. అది నమ్మి ఈ అబద్దాలు చెప్పే బ్యా్చ్ అందరూ నిజం చచ్చిందని జేజేలు కొడుతూ, షాంపెయిన్ తాగి డ్యాన్సులు ఆడుతుండగా ఎక్కడో వెనక నుంచి వచ్చి వెన్నుపోటు పొడుస్తుందని చెప్పారు. నిజాన్ని ఛేదించడానికి ఒకే ఒక్క సాధనం లాజికల్ థింకింగ్. ఎనాలసిస్ చేయకుండా టెక్నాలజీ ద్వారా, కొన్ని సర్కమ్ సెన్సెన్స్ ద్వారా.. అన్నింటి కన్నా ముఖ్యంగా నిజం మీద కాన్ సన్ స్ట్రేషన చేసినపుడే అబద్దం నుంచి నిజాన్ని కాపాడగలిగే ఒక అవకాశం ఉంటుందని తన గంభీరమైన వాయిస్ తో చెప్పుకొచ్చారు.
నిజం ఛానెల్ లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా.. కరెంట్ ఇష్యూస్, సైన్స్, హిస్టరీ, ఫిలాసఫీ, సెక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ గురించి మాట్లాడతామని రామ్ చెప్పారు. కొంతమందిని తాను ఇంటర్వ్యూ చేస్తానని, కొంతమందిని స్వప్న గారు చేస్తారని తెలిపారు. నిజం ఛానెల్ ఫస్ట్ ఎపిసోడ్ వైఎస్ వివేకా హత్య వెనక ఉన్న నిజంలో అబద్దం ఉందా అన్న అంశంపై ఉంటుందని, ఇది ఏప్రిల్ 25న సాయంత్రం 4గంటలకు రిలీజ్ అవుతుందని ఆర్జీవీ స్పష్టం చేశారు. వివేకా మర్డర్ వెనక ఉన్న నిజంలోని అబద్దాలు, అబద్దం చెప్పే వాళ్ల వెనక ఉన్న నిజాలు, అలా వాళ్లతో చెప్పించిన వాళ్ల వెనక ఉన్న అబద్దాలు బయటకు తీయడమే నిజం ఛానెల్ ముఖ్య ఉద్దేశమని వీడియో ద్వారా తెలియజేశారు.
తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని నెలల నుంచి అత్యంత చర్చనీయాశంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పటివరకూ చాలా మలుపులు తిరిగాయి. ఆయన 15మార్చి 2009లో కడపలోని తన నివాసంలోనే దారుణంగా హత్య చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ కేసులో ఇన్వా్ల్వ్ అయిన వారంతా ఇప్పటివరకూ తమ వెర్షన్ లో చెప్పుకుంటూ వస్తున్నారే తప్ప.. అసలు నిజం ఏమై ఉంటుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఆర్జీవీ తాజాగా ప్రకటించిన నిజం ఛానెల్ అనౌన్స్ మెంట్ తో కొన్ని నిజాలు బయటికొస్తాయని పలువురు భావిస్తున్నారు. దేన్నైనా ముక్కు సూటిగా, భయం లేకుండా చెప్పే వాళ్లలో ఒకరైన ఆర్జీవీ.. వివేకా హత్య కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలు, నిజాలు బట్టబయలు చేయనున్నాడోనని ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.