
బంగ్లాదేశ్తో జరగుతున్న చివరి వన్డేలో ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించాడు. 126 బంతుల్లోనే కిషన్ ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఇషాన్ ఇన్నింగ్స్లో 23 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం. అతను ఫోర్లు, సిక్సుల ద్వారానే 146 పరుగులు చేయడం గమనార్హం. 131 బంతుల్లో 210 పరుగులు(24 ఫోర్లు,10 సిక్సులు) చేసి ఔటయ్యాడు. ప్రస్తుతానికి భారత్ స్కోరు 36 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. క్రీజులో విరాటో కోహ్లీ 85 నాటౌట్ గా ఉన్నాడు.
ఓపెనర్గా వచ్చిన ఇషాన్ కిషన్ బంగ్లా బౌలర్లను చితక్కొట్టాడు. ఎదుర్కొన్న మొదటి బంతి నుంచే బంగ్లా బౌలర్లపై బ్యాట్ ఝుళిపించాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో 85 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇందులో 15 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి. కోహ్లీతో కలిసి రెండో వికెట్ పడకుండా కాపాడాడు.
నాల్గో క్రికెటర్ ఇషాన్..
మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్...వరల్డ్ వైడ్గా డబుల్ సెంచరీ చేసిన 9వ క్రికెటర్గా చరిత్రకెక్కాడు. భారత్ తరపున డబుల్ సెంచరీ చేసిన నాల్గో క్రికెటర్గా రికార్డు సాధించాడు. వన్డేల్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత భారత్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్ ఒక్కోసారి డబుల్ సెంచరీ బాదారు.
కిషన్ కెరీర్..
2021లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేసిన ఇషాన్కు ఇదే మొదటి సెంచరీ.. ఇక ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడిన ఇషాన్...453 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థసెంచరీలతో పాటు..ఓ సెంచరీ ఉంది