16 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటింది

16 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటింది

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శనివారం 16 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, యనంబైలులో 46.4 డిగ్రీల చొప్పున, కుమ్రం భీమ్​ ఆసిఫాబాద్ జిల్లా జంబుగలో 46.1, ములుగు జిల్లా తాడ్వాయి హట్స్,  సీతారామపట్నం, మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారంలో 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.