- ఫేక్ కరెన్సీ గ్యాంగ్ అరెస్ట్
నేరెడ్మెట్, వెలుగు: రెండు వేల నోట్లు బంద్అవుతున్నాయని, బ్లాక్మనీ ఉన్నవారు రూ. లక్ష చిల్లర నోట్లు ఇస్తే 5 లక్షల విలువైన రెండు వేల నోట్లు ఇస్తున్నారంటూ మోసానికి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ కమిషనరేట్లో సీపీ మహేశ్భగవత్శనివారం కేసు వివరాలు వెల్లడించారు. కరీంనగర్కు చెందిన రాజిరెడ్డికి ఆరు నెలల క్రితం భాగ్యలక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇటీవల భాగ్యలక్ష్మి రూ. 2 వేల నోట్లు త్వరలో బంద్అవుతాయంటూ రాజిరెడ్డికి చెప్పింది. బ్లాక్మనీ ఉన్నవారు రూ. 500, రూ. 200 నోట్లు లక్ష విలువైనవి ఇస్తే రూ. 5 లక్షల విలువైన రూ. 2 వేల నోట్లు ఇస్తున్నారని నమ్మించింది. చిల్లర నోట్లు ఇచ్చి రూ. 2 వేల నోట్లు తీసుకునేందుకు శామీర్పేటకు రావాలని చెప్పింది. ఈ నెల 2న రాజిరెడ్డి శామీర్పేట ఫామ్హౌజ్కు వచ్చాడు. అక్కడ పోలీస్డ్రెస్లో ఉన్న వ్యక్తి బ్లాక్మనీ దందా చేస్తున్నావా అంటూ బెదిరించి రాజిరెడ్డి దగ్గర ఉన్న రూ. 5 లక్షలు తీసుకుని పరారయ్యాడు. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన రాజిరెడ్డి 9న కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీపీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు కరీంనగర్కి చెందిన రియల్ఎస్టేట్వ్యాపారి, మాజీ నేరస్తుడు మహ్మద్అజీజ్అలియాస్అజామ్(35), పెద్దపల్లికి చెందిన డ్రైవర్ మహ్మద్అన్వర్ పాషా(38), సనత్నగర్లో ఉంటూ ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడక్షన్ మేనేజర్గాచేస్తున్న తడుక సుభాష్ చంద్రబోస్(41), అబ్దుల్లాపూర్మెట్లో ఉంటూ డ్రైవర్గా పనిచేసే మర్రి నాగరాజు (28), కరీంనగర్లో ఉంటూ ప్రైవేట్ నర్స్గా పనిచేసే జంగం భాగ్యలక్ష్మి(40), అదే జిల్లాకు చెందిన రవీందర్ సింగ్, రాజేష్మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. వీరి నుంచి రూ. 1.3 లక్షల నగదు, రూ. కోటి విలువైన నకిలీ నోట్లు, కారు, 8 సెల్ఫోన్లు, పోలీస్యూనిఫాం స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను రిమాండ్ కు తరలించామని, పరారీలో ఉన్న ఇద్దరిని త్వరలో పట్టుకుంటామని సీపీ చెప్పారు.