
హైదరాబాద్ : భారత్లో ఆర్థిక అభివృద్ధి కన్నా నాయకులు రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడతారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. HICCలో NHRD ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై కేటీఆర్ మాట్లాడారు. ‘భారత్లోనూ ఎంతో మంది గొప్పవారు, తెలివైన నేతలు ఉన్నారు. అయితే.. మెరుగైన ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలకు మనకన్నా మంచి భవితను అందించే అంశాలపై వారు దృష్టి పెట్టడం లేదు. ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఏడాదంతా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. దృష్టి అంతా ఎన్నికలపైనే ఉంటుంది. దేశంలో ఇప్పుడున్న ప్రధాన సమస్య ఇదే. ఇతర దేశాల మాదిరిగా భారత్లోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే నంబర్ వన్గా ఎదుగుతాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.