కూకట్పల్లి, వెలుగు: కూకట్ పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆఫీసులో ఐటీ అధికారులుమంగళవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు మందడి ఆఫీసుకు చేరుకున్న ఐటీ అధికారులు.. రాత్రి 8 గంటల దాకా సోదాలు చేశారు. సోమవారం రాత్రి అదే కాలనీలో ఉన్న మందడి ఇంటిలో కూ డా సోదాలు చేసినట్లు తెలిసింది.
పన్నులు ఎగ్గొట్టడంతో సోదాలు చేస్తున్నారా? లేక మరేదైనా కారణముందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. శ్రీనివాసరావు మొదటి నుంచి కేపీహెచ్బీ కాలనీ కేంద్రంగా బిల్డర్గా పని చేస్తున్నారు. శ్రీహర్ష కన్స్ర్టక్షన్ పేరుతో సంస్థని నడుపుతున్నారు. మందడి బిల్డర్, కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారని తెలిసింది.