టీఆర్ఎస్​ కార్పొరేటర్ ఇల్లు, ఆఫీసులో ఐటీ సోదాలు

టీఆర్ఎస్​ కార్పొరేటర్ ఇల్లు, ఆఫీసులో ఐటీ సోదాలు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్ పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్​బీ డివిజన్​ టీఆర్ఎస్​ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆఫీసులో ఐటీ అధికారులుమంగళవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు మందడి ఆఫీసుకు చేరుకున్న ఐటీ అధికారులు.. రాత్రి 8 గంటల దాకా సోదాలు చేశారు. సోమవారం రాత్రి అదే కాలనీలో ఉన్న మందడి ఇంటిలో కూ డా సోదాలు చేసినట్లు తెలిసింది.

పన్నులు ఎగ్గొట్టడంతో సోదాలు చేస్తున్నారా? లేక మరేదైనా కారణముందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. శ్రీనివాసరావు మొదటి నుంచి కేపీహెచ్​బీ కాలనీ కేంద్రంగా బిల్డర్​గా పని చేస్తున్నారు. శ్రీహర్ష కన్​స్ర్టక్షన్​ పేరుతో సంస్థని నడుపుతున్నారు. మందడి బిల్డర్, కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారని​ తెలిసింది.