హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి ఐటీ రెయిడ్స్ కలకలం రేపాయి. ఎల్బీనగర్లోని బీజేపీ నేత శ్రీరాములు యాదవ్ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులు సోదాలు చేపట్టారు. ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు పీఏ ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాములు యాదవ్ మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ లీడర్ ఇంట్లో ఐటీ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.