మెఘా సంస్థలో ఐటీ రైడ్స్….

మెఘా సంస్థలో ఐటీ రైడ్స్….

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కార్యాలయాల్లో సోదాలు చేశారు ఐటీ శాఖ అధికారులు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపొయే వరకు తనిఖీలు కొనసాగాయి. మొత్తం 42 మంది అధికారులు… హైదరాబాద్ తో పాటు ఏపీ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలో ఒకేసారి తనిఖీల్లో పాల్గొన్నారు. ఐతే ఇవన్నీ రొటీన్ గానే జరుగుతున్నాయని చెప్తున్నారు కంపెనీ ప్రతినిధులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో  పాటు దేశ వ్యాప్తంగా పలు కీలక ప్రాజెక్టులు  చేస్తోంది. కాశేళ్వరం  ప్రాజెక్టును కూడా మెఘా  కంపెనీయే  నిర్మిస్తోంది.  ఏపీలో  పోలవరం  రివర్స్ టెండరింగ్  కూడా మెఘా సంస్థనే  దక్కించుకుంది.

జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 25 లో కృష్ణారెడ్డి నివాసంతో పాటు ఆయన ఆఫీస్, జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని డైమండ్ హౌజ్, ఓ డైరెక్టర్ ఇల్లు, బాలానగర్ లోని మేఘా కంపెనీ ఆఫీసులో తనిఖీలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి కంపెనీకి చెందిన వివిధ డాక్యుమెంట్లు, కంప్యూటర్లను పరిశీలించినట్టు సమాచారం.