కాసేపట్లో సీఎం అభ్యర్థిని ప్రకటించే చాన్స్.. కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ

కాసేపట్లో సీఎం అభ్యర్థిని ప్రకటించే చాన్స్.. కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ

అందరూ అనుకున్నట్లే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైందని తెలుస్తోంది. కాసేపట్లో ఢిల్లీ నుంచి డీకే శివకుమార్, ఏఐసీసీ అబ్జర్వర్లు హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ కు రాగానే కొత్త ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్, ఏఐసీసీ అబ్జర్వర్లు భేటీ కానున్నారు. ప్రస్తుతం ఎల్లా హోటల్ లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 

మరోవైపు.. కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ కొనసాగుతోంది. కేసీ వేణుగోపాల్ ఇంటికి మల్లు భట్టి విక్రమార్క చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రేతో మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. 

మరోవైపు.. ముఖ్యమంత్రి అభ్యర్థితో పాటు డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు ఎవరు చేపట్టాలనేదానిపైనా కాంగ్రెస్ అధిష్టానంపై పేర్లను ఫైనల్ చేసింది. దాదాపుగా రేవంత్ రెడ్డినే సీఎంగా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేబినెట్ లో ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం బాధ్యతలు మల్లు భట్టి విక్రమార్కకు, ఆర్థికశాఖ బాధ్యతలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగితే డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ కొత్త సర్కార్ కొలువుదీరనుంది.