భద్రాచలం, వెలుగు : గిరిజన దర్బార్లో గిరిజనులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ యూనిట్ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం గిరిజన దర్బార్లో ఆయన ఆదివాసీల నుంచి ఆర్జీలు స్వీకరించి యూనిట్ ఆఫీసర్లతో మాట్లాడారు. ప్రతి యూనిట్ఆఫీసర్ తమ పరిధిలోని సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతర పనులను ఆన్లైన్ చేసి ఉంచాలని చెప్పారు. అర్హులైన ప్రతి గిరిజనుడికి తప్పనిసరిగా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని తెలిపారు.
