హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థల సీఎండీలతో జరిగిన జాయింట్ సమావేశంలో ఉద్యోగుల 12 ప్రధాన డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లామని జేఏసీ కో-చైర్మన్ పి.అంజయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ కోసం వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని కోరినట్లు వివరించారు.
1999–2004 మధ్య నియమితులైన ఈపీఎఫ్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం, రిటైరైన ఈపీఎఫ్ ఉద్యోగులకు మెడికల్ సౌకర్యం కల్పించాలని కోరారు. జేఏసీ చేసిన డిమాండ్లపై సీఎండీలు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
