- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి
గరిడేపల్లి, వెలుగు : హుజూర్నగర్ నియోజకవర్గంలో కొందరు పోలీసులు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. సోమవారం గరిడేపల్లి మండలం పొనుగోడు, గడ్డిపల్లి, కుతుబ్షాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. చింతలపాలెం, గరిడేపల్లి పరిధిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఉదయం నుంచి సాయంత్రం వరకు బైండోవర్ కేసులు పెడుతున్నారని తెలిపారు.
తమ నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించబోమని హెచ్చరించారు. అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు రెండేండ్ల పాలనలోనూ ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి ప్రజలకు కళ్లముందే కనిపిస్తోందని పేర్కొన్నారు.
ప్రశ్నించిన వారిని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. కొందరు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, అమాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, కడియం వెంకట్ రెడ్డి, మాశెట్టి శ్రీహరి, నల్లపాటి భాస్కర్, మేళ్లచెర్వు వెంకటరమణ పాల్గొన్నారు.
