విశాఖ ఆటో ప్రమాదంపై సీఎం జగన్ దిగ్ర్భాంతి

విశాఖ ఆటో ప్రమాదంపై సీఎం జగన్ దిగ్ర్భాంతి

విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం చెరువులో జరిగిన ఆటో ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.  విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీ కొట్టడంతో మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని చెప్పారు.  ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా..మరో ఆరుగురికి గాయాలయ్యాయి.