సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ పొడిగింపు

సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ పొడిగింపు

మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత,  ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు 2023 జూలై 10న పొడిగించింది.  ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ను పొడిగించాలని ఆయన కోర్టను కోరారు.  

దీంతో న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం జైన్ కు 2023 జూలై 24 వరకు బెయిల్ పొడిగించింది. జైన్‌కు శస్త్రచికిత్స చేయాలని మూడు ఆసుపత్రులు సిఫార్సు చేశాయని  ఆయన తరుపు లాయర్ అభిషేక్  సింఘ్వి కోర్టుకు తెలిపారు.   కాగా మనీలాండరింగ్   కేసులో గ‌తేడాది మే 31న ఈడీ అధికారులు జైన్‌ను అరెస్ట్ చేశారు.