మహిళా ఉద్యోగి గురించి అసభ్యకర పోస్టులు.. జనగామ కలెక్టరేట్ ఏవో అరెస్ట్.. పోష్ యాక్ట్ కేసు

మహిళా ఉద్యోగి గురించి అసభ్యకర పోస్టులు.. జనగామ కలెక్టరేట్ ఏవో అరెస్ట్.. పోష్ యాక్ట్ కేసు

జనగామ, వెలుగు: మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగిపై ‘పోష్’ యాక్ట్​ కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. జనగామ కలెక్టరేట్​లోని అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​లో జూనియర్​ అసిస్టెంట్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ మహిళ ఫొటోలు తీసిన ఏవో విజయ్​రెడ్డి వాటిని సోషల్​మీడియాలో పోస్ట్​చేశాడు. వాటికి అసభ్యకరమైన కామెంట్స్​జత చేశాడు.

 దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని విజయ్​రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా పోస్టులు, ఇతర సాక్ష్యాల ఆధారంగా విజయ్​ రెడ్డిపై ‘పోష్’(పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు) యాక్ట్​2013 కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించి నట్లు చెప్పారు.