జనగామ పట్టణ బ్యూటిఫికేషన్ పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్

జనగామ పట్టణ బ్యూటిఫికేషన్ పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణ బ్యూటిఫికేషన్​ పనులు వేగవంతం చేయాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం అడిషనల్​ కలెక్టర్​ పింకేశ్​ కుమార్​తో కలిసి జనగామ పట్టణానికి సంబంధించి హనుమకొండకు వెళ్లే దారిలో సీబీఎఫ్ నిధులు రూ.30 లక్షలతో నిర్మిస్తున్న ఆర్చి, విద్యుద్దీకరణ పనులను సంబంధిత మున్సిపల్​ అధికారులతో కలెక్టర్​ సందర్శించి, పరిశీలించారు.

జనగామ ఎంట్రెన్స్​ ప్రయాణికులకు పట్టణ ప్రజలకు ఆకర్షణీయంగా కనిపించే విధంగా బ్యూటిఫికేషన్​ పనులను చేపట్టాలన్నారు. స్వాగతంతో పాటు ప్రభుత్వ చిహ్నాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్​ మహిపాల్ తదితరులున్నారు. 

కేజీబీవీలలో బాలికల నమోదు పెంచాలి

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యను బలోపేతం చేసేందుకు నమోదు  పెంచాలని అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ కేజీబీవీ స్పెషల్​ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో జిల్లా విద్యాశాఖ అధికారితో కలిసి 12 మంది కేజీబీవీ స్పెషల్​ఆఫీసర్లతో జూమ్​ మీటింగ్​నిర్వహించారు. బడిబాటను ఎంచుకొని గ్రామ సభల్లో ప్రజలకు తెలియజేయాలన్నారు. కేజీబీవీ పాటించే నాణ్యత ప్రమాణాలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో డీఈవో భోజయ్య, గర్ల్స్​ చైల్డ్​ వెల్పేర్​ ఆఫీసర్ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.