
జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణ బ్యూటిఫికేషన్ పనులు వేగవంతం చేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి జనగామ పట్టణానికి సంబంధించి హనుమకొండకు వెళ్లే దారిలో సీబీఎఫ్ నిధులు రూ.30 లక్షలతో నిర్మిస్తున్న ఆర్చి, విద్యుద్దీకరణ పనులను సంబంధిత మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సందర్శించి, పరిశీలించారు.
జనగామ ఎంట్రెన్స్ ప్రయాణికులకు పట్టణ ప్రజలకు ఆకర్షణీయంగా కనిపించే విధంగా బ్యూటిఫికేషన్ పనులను చేపట్టాలన్నారు. స్వాగతంతో పాటు ప్రభుత్వ చిహ్నాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ మహిపాల్ తదితరులున్నారు.
కేజీబీవీలలో బాలికల నమోదు పెంచాలి
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యను బలోపేతం చేసేందుకు నమోదు పెంచాలని అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారితో కలిసి 12 మంది కేజీబీవీ స్పెషల్ఆఫీసర్లతో జూమ్ మీటింగ్నిర్వహించారు. బడిబాటను ఎంచుకొని గ్రామ సభల్లో ప్రజలకు తెలియజేయాలన్నారు. కేజీబీవీ పాటించే నాణ్యత ప్రమాణాలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో డీఈవో భోజయ్య, గర్ల్స్ చైల్డ్ వెల్పేర్ ఆఫీసర్ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.