ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్.. పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన జ‌న‌సేన‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్.. పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన జ‌న‌సేన‌

హైదరాబాద్:  సోషల్ మీడియాలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథం ఘటన పై ధర్మ పోరాట చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫోటోలను క్షుద్రపూజలు చేస్తున్న విధంగా చిత్రీకరించి, అసభ్య పదజాలంతో దూషిస్తూ ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం మండిప‌డ్డారు. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ చేసిన‌ వారి వివరాలను పోలీసులకు అందించామ‌ని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు రాజ‌లింగం.