ఎన్ కౌంటర్లో లష్కరే తోయిబా ముదాసిర్ పండిట్ హతం

ఎన్ కౌంటర్లో లష్కరే తోయిబా ముదాసిర్ పండిట్ హతం

జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. సోపోర్ ఏరియాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. మృతుల్లో లష్కర్ ఏ తోయిబా కు చెందిన ఉగ్రవాది ముదాసిర్ పండిట్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ముదాసిర్ పండిట్ ముగ్గురు పోలీసులు, ఇద్దరు కౌన్సిలర్లు, ఇద్దరు పౌరులను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారని చెప్పారు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్. ఇక మృతుల్లో పాకిస్థాన్ కు చెందిన అస్రర్ అలియాస్ అబ్దుల్లా కూడా మృతుల్లో ఉన్నారని చెప్పారు. 2018 నుంచి నార్త్ కశ్మీర్ లో అబ్దుల్లా యాక్టివ్ గా పని చేస్తున్నాడని చెప్పారు. మరింత మంది ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో గాలింపు కొనసాగుతుందన్నారు.