
జనగామ అర్బన్, వెలుగు : నిరుపేదలకు మెరుగైన వైద్యం అందాలని, డాక్టర్లు అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షణ ఉండాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్భాషా షేక్ అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా ఆస్పత్రిని ఆయన సందర్శించి, పరిశీలించారు. సిటీస్కాన్ పనితీరుకి సంబంధించిన డెమోని పరిశీలించి వచ్చే వారం ప్రారంభానికి ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
ఫిజియోథెరపీ విభాగం సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని, యూనిట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వైద్యం కోసం వచ్చిన మహిళలతో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం రోగులకు భోజనం సకాలంలో పెడుతున్నట్లు తెలియజేయగా కలెక్టర్సంతృప్తి చెందారు. కార్యక్రమంలో మెడికల్కాలేజీ ప్రిన్సిపల్ గోపాల్రావు, ఆర్ఎంవో లక్ష్మీనారాయణ, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.