ఏసీబీ వలలో జనగామ మున్సిపల్​ కమిషనర్

ఏసీబీ వలలో జనగామ మున్సిపల్​ కమిషనర్
  • ఏసీబీ వలలో జనగామ మున్సిపల్​ కమిషనర్
  • ‘మార్టిగేజ్​’ రిలీజ్​ కోసం  రూ. 40 వేలు డిమాండ్​ చేసిన రజిత
  • కారు డ్రైవర్​కు ఇస్తుండగా  రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న ఆఫీసర్లు 

జనగామ అర్బన్, వెలుగు : జనగామ మున్సిపల్​కమిషనర్​ జె. రజిత 40 వేల రూపాయలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకీ చిక్కారు. ఈ కేసులో మున్సిపల్​ కమీషనర్​తో పాటు ఆమె కారు డ్రైవర్​ నవీన్ ను కూడా ఏసీబీ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. ​సోమవారం ఏసీబీ డీఎస్​పీ సాంబయ్య  వెల్లడించిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని బండ్లగూడెం గ్రామానికి చెందిన చెట్టిపల్లి రాజు జనగామలో బిల్డింగ్ రూల్స్​ప్రకారం ఓ భవనం నిర్మించడం కోసం మున్సిపల్​ఆఫీస్​ పేరుమీద 10 శాతం స్థలాన్ని మార్టిగేజ్​ చేశాడు. 

నిర్మాణం పూర్తయిన తర్వాత బిల్డింగ్ ​మార్టిగేజ్​ రిలీజ్​ కోసం, తర్వాత రాజు పేరుపై మార్చడానికి కమీషనర్ రజిత రూ. 40 వేలు లంచం డిమాండ్​ చేసింది. దీంతో బాధితుడు  తాను లంచం ఇచ్చుకోలేనని చెప్పినా వినిపంచుకోలేదు. దీంతో ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల ప్రకారం...సోమవారం రూ.40 వేలు తీసుకొని మున్సిపల్​ఆఫీస్ కు వచ్చాడు. ఆ డబ్బులను తన డ్రైవర్​ నవీన్​ కు ఇవ్వాలని కమీషనర్ ​రజిత సూచించింది. దీంతో రాజు నవీన్​చేతిలో డబ్బులు పెడుతుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. డ్రైవర్ ​నవీన్​తో పాటు మున్సిపల్​ కమీషనర్ ​రజితను విచారించారు. ఆమె లంచం అడిగింది నిజమేనని ఒప్పుకున్నారు. రజితతో పాటు డ్రైవర్​ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్డులో హాజరుపరుచనున్నట్లు సాంబయ్య తెలిపారు. ఏసీబీ ఇన్​స్పెక్టర్లు రవి, శ్రీనివాస్, శ్యాం పాల్గొన్నారు.