పది ఫలితాల్లో మానుకోట టాప్​ : జాటోతురామచంద్రునాయక్​

పది ఫలితాల్లో మానుకోట టాప్​ : జాటోతురామచంద్రునాయక్​
  • ప్రభుత్వ విప్, డోర్నకల్​ ఎమ్మెల్యే  జాటోతురామచంద్రునాయక్​

మహబూబాబాద్, వెలుగు: ఇటీవల విడుదలైన పది పరీక్ష ఫలితాల్లో మానుకోట టాప్​లో నిలవడం సంతోషాన్నిచ్చిందని, ఇదే స్థాయిలో జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపడానికి కాంగ్రెస్​ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్​ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్​ అన్నారు. సోమవారం మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండా  ఆవిష్కరించి, మాట్లాడారు.

 మహబూబాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3634 మంది లబ్ధిదారులకు రూ.36,4 ,58,144 మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం రైతులకు విత్తనాల పంపిణీ చేపట్టారు. మహబూబాబాద్​ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్, కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్​ కేకన్, అడిషనల్​కలెక్టర్​ కె.వీర బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.