
- ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతురామచంద్రునాయక్
మహబూబాబాద్, వెలుగు: ఇటీవల విడుదలైన పది పరీక్ష ఫలితాల్లో మానుకోట టాప్లో నిలవడం సంతోషాన్నిచ్చిందని, ఇదే స్థాయిలో జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి, మాట్లాడారు.
మహబూబాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3634 మంది లబ్ధిదారులకు రూ.36,4 ,58,144 మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం రైతులకు విత్తనాల పంపిణీ చేపట్టారు. మహబూబాబాద్ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, అడిషనల్కలెక్టర్ కె.వీర బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.