జావేద్ అక్తర్​కు సినారె అవార్డు

జావేద్ అక్తర్​కు సినారె అవార్డు

బషీర్ బాగ్, వెలుగు: ప్రముఖ కవి, హిందీ సినీ పాటల రచయిత జావేద్​ అక్తర్​కు ‘విశ్వంభర నారాయణ రెడ్డి జాతీయ అవార్డు’ ను ప్రదానం చేశారు. డాక్టర్  సి.నారాయణ రెడ్డి 92వ జయంతి వేడుకలు సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం రవీంద్ర భారతిలో నిర్వహించా రు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్​ విద్యాసాగర్ రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. జావేద్ అక్తర్​కు ఈ సందర్భంగా వారు సినారె అవార్డును ప్రదానం చేశారు. సినారె పేరిట తనకు అవార్డు రావడం ఆనందంగా ఉందని జావేద్  అన్నారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమాణాచారి, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సినారె మనుమడు లయ చరణ్, ఫిల్మ్ మేకర్  దీపక్, సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు ప్రధాన కార్యదర్శి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.