సరిహద్దుల్లో శత్రువుల నుంచి దేశాన్ని కాపాడడమే కాదు, జనానికి ఆపదొచ్చినా ముందుంటారు సైనికులు. అందుకు ఈ ఫొటోనే నిదర్శనం. షమీమా అనే గర్భిణీకి నెలలు నిండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. కానీ, మంచు బాగా కురవడంతో బండ్లు వెళ్లేందుకు తొవ్వ కూడా సరిగా లేదు. దీంతో చినార్ కార్ప్స్కు చెందిన వంద మంది జవాన్లు ఆమెను స్ట్రెచర్మీద ఆస్పత్రికి మోసుకెళ్లారు. ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు గంటల పాటు నడుచుకుంటూ ఆమెని హాస్పిటల్కు తీసుకెళ్లారు. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఆ వీడియోను చినార్ కార్ప్స్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఆర్మీ డే నాడే (జనవరి 15) ఇది జరిగింది. ఇక, ఆ వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ రీట్వీట్ చేశారు. ‘‘ధైర్యసాహసాలకు మన ఆర్మీ ప్రతీక. అంతేకాదు, మానవత్వపు స్ఫూర్తిని చాటుతుంది. ఆపద అని అంటే చాలు, అన్ని వేళలా అందుబాటులో ఉండి తన వంతు సాయం చేస్తుంది. ఆర్మీ మనందరికీ గర్వ కారణం. షమీమా, ఆమె బిడ్డకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
4 గంటలు.. 100 మంది జవాన్లు.. భుజాలపై గర్భిణీ
- దేశం
- January 17, 2020
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు