ఏసీసీ పగ్గాలు మళ్లీ జై షాకే

ఏసీసీ పగ్గాలు మళ్లీ జై షాకే


న్యూఢిల్లీ: బీసీసీఐ సెక్రటరీ జై షా వరుసగా మూడోసారి ఆసియా క్రికెట్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ (ఏసీసీ) ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. బాలీలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో జై షా పదవీ కాలాన్ని పొడిగించాలని లంక క్రికెట్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ షమ్మీ సిల్వా చేసిన ప్రతిపాదనకు ఏసీసీ మెంబర్స్‌‌‌‌‌‌‌‌ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2021లో బంగ్లా క్రికెట్‌‌‌‌‌‌‌‌ బోర్డు ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ నజ్ముల్‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌ నుంచి షా ఈ బాధ్యతలు స్వీకరించారు. అప్పట్నించి ఇదే పదవిలో కొనసాగుతున్నారు. జై షా నాయకత్వంలోనే ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ను 2022లో టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో 2023లో వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో విజయవంతంగా నిర్వహించారు.