IPLFinal: ఐపీఎల్ ఫైనల్ టైంలో.. ఆర్సీబీ ఆటగాళ్ల హోటల్కు జైషా.. అసలేం జరుగుతోంది..?

IPLFinal: ఐపీఎల్ ఫైనల్ టైంలో.. ఆర్సీబీ ఆటగాళ్ల హోటల్కు జైషా.. అసలేం జరుగుతోంది..?

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్పై క్రికెట్ అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. ఐసీసీ చైర్మన్ జై షా ఆర్సీబీ ప్లేయర్లు బస చేస్తున్న అహ్మదాబాద్ హోటల్కు వెళ్లారనే వార్త, జై షా కారు దిగి హోటల్లోకి వెళుతున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. స్క్రిప్ట్ ఫైనల్ అయిందని, ఆర్సీబీకి ఐపీఎల్ కప్ కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆర్సీబీ యాంటీ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. జై షాను స్క్రిప్ట్ రైటర్ అని వెటకారం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. 

ఇక.. ఈ ఫ్యాన్ వార్స్ గురించి పక్కన పెడితే.. క్వాలిఫయర్-1 గెలిచి హాట్ ఫేవరెట్ టీంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ బరిలో నిలవగా, ముంబై లాంటి బలమైన జట్టును ఓడించి శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ ఫైనల్కు దూసుకొచ్చింది. 2024లో కోల్కత్తా నైట్ రైడర్స్కు ఐపీఎల్ కప్ అందించిన అయ్యర్ ఈసారి పంజాబ్ను ఫైనల్లో గెలిపించాలని పట్టుదలగా ఉన్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mufaddal Vohra (@mufastweet)

ఇక.. ఐపీఎల్ కప్ కోసం ఆర్సీబీ చేస్తున్న పోరాటం గురించి తెలిసిందే. రెండు జట్లకు ఐపీఎల్ కప్ గెలవడం ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయం. ఆర్సీబీకి ఐతే ఫైనల్ మ్యాచ్లో గెలవడం ఎంతో అవసరం. లక్షల మంది కోహ్లీ అభిమానులు ఆర్సీబీ గెలుపు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక.. అహ్మదాబాద్ పిచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న టీంకు అనుకూలిస్తుందనే అంచనాలున్నాయి. 

ఇక.. ఫైనల్ పోరులో తలపడుతున్న ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య జరిగిన గత 10 మ్యాచుల ఫలితాలను చూసుకుంటే.. 6 మ్యాచుల్లో ఆర్సీబీ గెలవగా, 4 మ్యాచుల్లో పంజాబ్ జట్టు గెలిచింది. కోహ్లీ కప్పు కల నెరవేరుతుందా? అయ్యర్ పంతం నెగ్గుతుందా? ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎవరు అవతరిస్తారు? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రశ్నలపైనే జోరుగా చర్చ జరుగుతోంది.

పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేసిన ఏకైక టీమ్‌‌ ఆర్సీబీనే. బెంగళూరు  పేసర్లు తమ హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెంగ్త్ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 53/4, 76/4, 38/4 స్కోర్లతో దెబ్బకొట్టారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఆర్సీబీతో 3 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 7, 6, 2 స్కోర్లు మాత్రమే చేశాడు. ఫైనల్లో ఆర్సీబీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడిని బ్యాటర్లు సమర్థవంతంగా తిప్పికొడితేనే పంజాబ్ తన లక్ష్యాన్ని అందుకోగలదు. ఫ్లాట్ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గత పోరులో ముంబైని కట్టడి చేసిందనే చెప్పొచ్చు. 

కానీ, ఆర్సీబీపై అర్ష్‌‌దీప్ నేతృత్వంలోని పేస్ విభాగం ఇంకా బాగా ఆడాల్సి ఉంటుంది.  చేతి వేలి గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ చాహల్ గత పోరులో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్వర్గధామం. ఫైనల్ ఎర్ర, నల్ల మట్టితో కూడిన సెంటర్ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జరగనుంది. ఇక్కడ ఎనిమిది మ్యాచ్‌‌ల్లో 11 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఆరుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే నెగ్గాయి.