
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూహెచ్ స్టూడెంట్స్కు ప్రపంచ స్థాయి విద్యనందించేందుకు వర్సిటీకి చెందిన ప్రతినిధులు జర్మనీలోని ప్రముఖ యూనివర్సిటీలను సందర్శిస్తున్నారు. జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టి.కిషన్కుమార్రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటేశ్వర్రావుల బృందం ఆదివారం జర్మనీలోని రాయుట్లింగెన్, యూనివర్సిటీ ఆఫ్ కాసెల్ను సందర్శించారు.
ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ బీటెక్ అండ్ ఎంఐటెక్ కోర్సు కోసం రాయుట్లింగెన్ యూనివర్సిటీతో, డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రాం, స్టూడెంట్స్ ఎక్సేంజ్, జాయింట్ రీసెర్చ్ తదితర అంశాలపై యూనివర్సిటీ ఆఫ్ కాసెల్తో పరస్పర సహకారం కోసం నాలెడ్జ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంవోయూలు కుదుర్చుకున్నారు.
అనంతరం పరిశ్రమలు – విద్య అనుసంధానంలో భాగంగా మెర్సిడెస్ బెంజ్ పరిశ్రమను సందర్శించి.. అధ్యాపక శిక్షణ, పాఠ్య ప్రణాళికల్లో కొత్తదనం అంశాలపై చర్చించారు.