డిసెంబర్ 29న మల్లేపల్లిలో జాబ్ మేళా

డిసెంబర్ 29న మల్లేపల్లిలో జాబ్ మేళా

మెహిదీపట్నం, వెలుగు : హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో జాబ్​లు కల్పించేందుకు మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలోని జిల్లా ఉపాధి ఆఫీసులో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మైత్రిప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మూడు కంపెనీల్లో 170 ఖాళీలకు గాను జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. 

టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యా అర్హత కలిగిన నిరుద్యోగులు రేపు ఉదయం 10 గంటలకు మల్లేపల్లిలోని జిల్లా ఉపాధి కార్యాలయానికి బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరు కాగలరని సూచించారు. ఇతర వివరాలకు జాబ్ మేళా వెబ్ సైట్   లేదా 800897 1739 నంబర్​కి సంప్రదించాలని జిల్లా ఉపాధికారి పేర్కొన్నారు.