
ములుగు, వెలుగు : అనారోగ్యంతో మార్చి 4న వీ6 ములుగు ప్రతినిధి కుంచం రమేశ్ మృతిచెందగా ఆయన కుటుంబానికి తోటి ప్రింట్, ఎలక్ట్రానిక్జర్నలిస్టు మిత్రులు ఆర్థిక సాయం అందజేశారు. శనివారం ఆయన స్వగ్రామం ములుగు మండలం ఇంచర్లలో రమేశ్భార్యకు రూ.35,500 అందజేశారు. ప్రభుత్వ పరంగా, ప్రెస్ అకాడమీ తరఫున సాయం అందేలా చొరవ తీసుకుంటామని యూనియన్నాయకులు వెల్లడించారు.