జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఓ యువతితో పాటుగా నలుగురు యవకులు ఉన్నారు. ప్రస్తుతం నిందితులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు.
2024 జనవరి 24వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ గుడి మలుపు దగ్గర అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న లింగాల తారకరామ్(30) అనే వక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి రాజకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కారు నడుపుతున్న వ్యక్తి... బైక్ను ఢీకొట్టి ఆపకుండా పరారయ్యాడు. కారు ఢీకొట్టిన వేగానికి బైక్ సుమారు 20 అడుగుల దూరంలో ఎగిరిపడింది. సంఘటనా స్థలంలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు.. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తీవ్ర గాయాలైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సిక్విలేజ్ సమీపంలోని గాంధీనగర్లో నివాసముంటున్న లింగాల తారకరామ్ మాదాపూర్లోని నోవాటెల్ హోటల్లో బౌన్సర్గా విధులు నిర్వహిస్తుంటాడు. బుధవారం తెల్లవారుజామున డ్యూటీ ముగించుకొని తనతో పాటే పనిచేస్తున్న రాజు అనే మరో బౌన్సర్తో బైక్ పై వెళ్తు్ండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తారక్కు ఏడాదిన్నర క్రితమే పెళ్లి కాగా.. 11 నెలల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు.