8 నుంచి ఫిష్ ఫెస్టివల్ మూడ్రోజుల పాటు నిర్వహణ

8 నుంచి ఫిష్ ఫెస్టివల్ మూడ్రోజుల పాటు నిర్వహణ


మెహిదీపట్నం, వెలుగు: మృగశిర కార్తి సందర్భంగా హైదరాబాద్ లో  జూన్ 8,9,10 తేదీల్లో(3 రోజుల పాటు) ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ -నిర్వహించనున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి ఎం. చరిత తెలిపారు. లోయర్ ట్యాంక్ బండ్ లోని ఎన్టీఆర్ స్టేడియం ( కళాభారతి ) వేదికగా ఈ  మేళా జరుగుతుందన్నారు. ఇందులో వివిధ రకాల చేపలు, రొయ్యలు, పీతలు, ఇతర ఆహార ఉత్పత్తుల వంటకాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 50 మంది మహిళలకు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్ మెంట్ ద్వారా చేపల వంటలో శిక్షణ ఇచ్చామని చెప్పారు. పలు మహిళా సహకార సంఘాల్లోని సభ్యులు ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ ఫ్రై, ఫిష్ బిర్యాని, ఫ్రాన్స్ బిర్యాని, హోల్ ఫిష్ ఫ్రై , ఆపోలో ఫిష్ , ఫిష్ పకోడీ వంటి వివిధ రకాల చేపల డిష్ ల అమ్మకాలు చేపడతారని వివరించారు. మూడ్రోజుల పాటు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు 40 స్టాల్స్ ద్వారా అమ్మకాలు కొనసాగించనున్నట్లు వెల్లడించారు. స్టాల్స్ బుకింగ్ కోసం హైదరాబాద్ జిల్లా మత్స్య శాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చని చరిత పేర్కొన్నారు.