రేపు (జూన్ 24) రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబరాలు.. సాయంత్రం 6 గంటలకు సచివాలయం ముందు రైతు నేస్తం సభ..

రేపు (జూన్ 24) రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబరాలు.. సాయంత్రం 6 గంటలకు సచివాలయం ముందు రైతు నేస్తం సభ..

మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఏర్పాటు చేసిన తొలి కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ అధ్యక్షతన జూన్ 23న జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని నిర్ణయించారు. 

రేపు (మంగళవారం, జూన్ 24) అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి తెలిపారు. 


కేవలం 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసాను రైతుల ఖాతాల్లో వేసినందుకు రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అన్ని మండల కేంద్రాలలో సంబరాలతో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. అదే విధంగా సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ ముందు ‘రైతు నేస్తం’ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఇక తెలంగాణ తల్లి విగ్రహాలను అన్ని కలెక్టరేట్ల ముందు ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదించింది. కొత్త నమూనా విగ్రహాలను అన్ని కలెక్టరేట్ల ముందు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం పదేండ్ల పాలించిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయలేక పోయిందని.. కానీ తమ ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కర్యాలయాల ముందు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.