- జనగామ జిల్లాలో ఘటన
రఘునాథపల్లి, వెలుగు: పని ఒత్తిడి తట్టుకోలేక జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఓ జూనియర్అసిస్టెంట్ సూసైడ్ చేసుకుంది. లింగాల ఘనపూర్ మండలం నవాబు పేటకు చెందిన సంధ్య(28) నాలుగేండ్లుగా లింగాల ఘనపూర్లో వీఆర్ఏగా పని చేస్తోంది. క్రమబద్ధీకరణలో జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ మేడ్చల్ జిల్లా బండ్లగూడ తహసీల్దార్ ఆఫీస్లో పోస్టింగ్ ఇచ్చారు.
దీంతో ఆమె ప్రతిరోజు రఘునాథపల్లి నుంచి మేడ్చల్కు అప్ అండ్ డౌన్ చేస్తూ డ్యూటీ చేస్తోంది. తన భర్త సూరత్లో ఉండడం, పిల్లలు చిన్నవాళ్లు కావడంతో వారిని చూసుకోవడానికి ఎవరూ లేక ఇబ్బంది పడేది. పిల్లల కోసం తనను తొందరగా ఇంటికి పంపించాలని ఆఫీసులో చెప్తే ఒప్పుకోవడం లేదని, పని ఒత్తిడి ఎక్కువగా ఉందని చుట్టుపక్కల వారికి చెప్పుకునేది.
ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళ్తేఇంటికి వచ్చేసరికి రాత్రి 9 అవుతోందని సంధ్య మనస్థాపం చెందింది. గురువారం ఇంట్లో ఎవరూ లేని టైమ్లో గడ్డి మందు తాగింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే సంధ్య చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.