పవన్ నిన్ను ఇంటర్నేషనల్ యాక్టర్ చేస్తాను.. నన్ను నమ్ము: కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

పవన్ నిన్ను ఇంటర్నేషనల్ యాక్టర్ చేస్తాను.. నన్ను నమ్ము: కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

సంచలన ప్రకటనలు, వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మరోసారి ఆ వ్యాఖ్యలే చేశారు. ఏపీ రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ.. తనవంతు ప్రయత్నం చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్ష్యులు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. పవన్ వెంటనే జనసేన పార్టీని.. ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని, అతని అభిమానులు అందరూ తమ పార్టీలో చేరిపోవాలని కేఏ పాల్‌ విజ్ఞప్తి చేశారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేఏ పాల్‌.. విశాఖ ఆశీలు మెట్టలోని ఫంక్షన్‌హాలు ప్రాంగణంలో సోమవారం సాయంత్రం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పాల్.. పవన్ కళ్యాణ్ వెంటనే జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని కోరారు. అలా తనని నమ్మి వస్తే పవన్‌ను ఇంటర్నేషనల్ యాక్టర్ చేస్తానని హామీ ఇచ్చారు.

ALSO READ : ఆసియా కప్ 2023 సమరం.. జట్లు, షెడ్యూల్ పూర్తి వివరాలివే

"పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ప్రజాశాంతి పార్టీలో చేరిపోండి. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మోఢీ, చంద్రబాబు, లోకేష్ జెండాలు మోయకుండా.. మన జెండా మోసుకుందాం.. కాపులం 27 శాతం ఉన్నాం. ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు. నిన్ను ప్యాకేజ్ స్టార్ అని తిడుతున్నారు. ఈ అడుక్కునే బతుకు మనకు అవసరమా. నువ్వు బీజేపీని గెలిపించమని 100 జన్మలు ఎత్తినా ఓటు వేయరు. వెంటనే జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి. పవన్ నిన్ను ఇంటర్నేషనల్ యాక్టర్ చేస్తాను.. నా మాట నమ్ము.." అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడారు.