పొంగులేటికి కేఏ పాల్ ఆహ్వానం.. ఎందుకంటే

పొంగులేటికి కేఏ పాల్ ఆహ్వానం.. ఎందుకంటే

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆహ్వానించారు.  తెలంగాణ అభివృద్ది కొరకు పోరాడుతున్న వారందరూ తన పార్టీకి మద్దతు తెలపాలన్నారు.  అందరూ రావలన్న కేఏపాల్.. రండి.. కలసి మాట్లాడుతాం.. మీరే నాయకులుకండని కేఏ పాల్ అన్నారు.  బీసీ నాయకులైన ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తన పార్టీలో చేరాలని కేఏపాల్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణకు 5 లక్షల కోట్లు అప్పులున్నాయన్న ఆయన తాను తప్పితే ఎవరూ అప్పులు తీర్చలేనని అన్నారు.