ఆ రోజున సెక్రటేరియట్ ఓపెనింగ్ వద్దు.. హైకోర్టులో కేఏ పాల్ పిల్

ఆ రోజున సెక్రటేరియట్ ఓపెనింగ్ వద్దు.. హైకోర్టులో కేఏ పాల్ పిల్

హైకోర్టు : కేసీఆర్ బర్త్ డే నాడు తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న కాకుండా అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న కొత్త సెక్రటేరియట్ ప్రారంభించేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందున ఆయన జయంతి రోజునే దాన్ని ప్రారంభించడం సముచితమని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపిస్తానన్న కేఏ పాల్.. ప్రతివాదులుగా సీఎంఓ, చీఫ్ సెక్రటరీలను చేర్చారు.