ఏపీలో 70 శాతం నన్ను సీఎంగా కోరుకుంటున్నరు: కేఏ పాల్

ఏపీలో 70 శాతం నన్ను సీఎంగా కోరుకుంటున్నరు: కేఏ పాల్

ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణపై తీవ్ర ఆరోపణలు చేశారు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్.  తనను కలిసినప్పుడు  బొత్స సత్యనారాయణకు కోటి రూపాయల ఆస్తి కూడా లేదని.. ఇపుడు  లక్ష కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ఆరోపించారు... ఆయన ఆస్తులపై సిట్ తో విచారణ జరిపించాలన్నారు. వైఎస్సార్ సీపీలో  అవినీతి పరులందరినీ సీబీఐతో  విచారించాలని డిమాండ్ చేశారు. 

 వైఎస్సార్ సీపీ పాలనలో ఆదాయం పెరగలేదు కానీ అక్రమాలు అప్పులు పెరిగాయని విమర్శించారు కేఏపాల్. ఏపీలో 60, 70 శాతం మంది  ప్రజలు తనను సీఎంగా కోరుకుంటున్నారని అన్నారు. త్వరలో ఏపీకి 8 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తానని చెప్పారు. చంద్రబాబు వస్తే ఏపీని మింగేస్తాడని  మండిపడ్డారు.