వేర్వేరు చోట్ల ముగ్గురు మిస్సింగ్

వేర్వేరు చోట్ల ముగ్గురు మిస్సింగ్

బషీర్​బాగ్, వెలుగు: స్టూడెంట్ మిస్సింగ్ ఘటన కాచిగూడ పీఎస్​ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ రామలక్ష్మణరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడలోని నింబోలిఅడ్డా ప్రాంతంలో ఉండే సునీత కూలి పనిచేస్తోంది. ఆమె పెద్ద కుమార్తె  సాక్షి  ఇటీవల విడుదలైన టెన్త్ రిజల్ట్స్​లో ఫెయిలైంది. మనస్తాపానికి గురైన సాక్షి ఈ నెల 17న మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటికెళ్లి తిరిగిరాలేదు. కూతురి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇండ్లలో వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో సునీత మంగళవారం కాచిగూడ పోలీసులకు కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. 

శంకర్​పల్లిలో తల్లీకొడుకు..

శంకర్ పల్లి:  తల్లీకొడుకు మిస్సింగ్ ఘటన శంకర్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. గాజులగూడ గ్రామానికి చెందిన అమరేందర్(30)​, అనురాధ(25) దంపతులకు కొడుకు భార్గవ్(5) ఉన్నాడు. భర్తతో గొడవ కారణంగా అనురాధ కొన్నిరోజుల పాటు పుట్టింటి దగ్గర ఉంది.  పెద్దలు సర్దిచెప్పి ఆమెను మళ్లీ భర్త దగ్గరికి పంపించారు. ఆ తర్వాత కూడా అమరేందర్, అనురాధ మధ్య గొడవలు ఆగలేదు. దీంతో మంగళవారం ఆమె కొడుకుని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యుల కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.