అమ్మకు బాగాలేదు ... సీబీఐ విచారణకు రాలేను : ఎంపీ అవినాష్ రెడ్డి

అమ్మకు బాగాలేదు ... సీబీఐ విచారణకు రాలేను : ఎంపీ అవినాష్ రెడ్డి

సీబీఐ విచారణకు హాజరుకాకుండా కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుకు బయలుదేరి వెళ్లారు. తమ తల్లి అనారోగ్యంగా ఉందని, సీబీఐకి లేఖ రాసి పులివెందులకు వెళ్లారు. ఉదయం సీబీఐ కార్యాలయం నుంచి హడావిడిగా రెండు ఇన్నోవా కార్లు బయల్దేరి వెళ్లాయి. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు అవినాష్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. కానీ..  తమ తల్లి అనారోగ్యంగా ఉందని చెప్పి పులివెందులకు వెళ్లారు.

ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి చిక్సిత పొందుతున్న పులివెందులలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తున్నారు. వివేకా హత్య కేసులో ఇప్పటికి ఆరుసార్లు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. విచారణకు తాను హాజరుకావడం లేదని రాసిన ఎంపీ అవినాష్ రెడ్డి లేఖపై సీబీఐ ఇంకా స్పందించలేదు. అయితే.. ఎలా స్పందిస్తుందానేది చాలా ఆసక్తిగా మారింది