కాకా క్రికెట్ టోర్నీ: నస్పూర్, లక్సెట్టిపేట టీమ్స్ విక్టరీ

కాకా క్రికెట్ టోర్నీ:  నస్పూర్, లక్సెట్టిపేట టీమ్స్ విక్టరీ

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​సింగరేణి ఠాగూర్ స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక మంచిర్యాల నియోజకవర్గ క్రికెట్​పోటీలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్​లలో నస్పూర్, లక్సెట్టిపేట టీమ్స్​గెలుపొందాయి. ఉదయం నస్పూర్, మంచిర్యాల రాయల్స్​జట్లు తలపడగా, మొదట బ్యాటింగ్​చేసిన మంచిర్యాల టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 147 రన్స్​చేసింది. ప్రదీప్ 54 బాల్స్​లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 65 రన్స్, ఎండీ షైప్​35 రన్స్ చేశారు. నస్పూర్​టీమ్​18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్​ను చేజ్​చేసింది.

శ్రీకాంత్​ 34 రన్స్​చేశాడు. మంచిర్యాల రాయల్స్​కు చెందిన ప్రదీప్​‘ప్లేయర్​ ఆఫ్​ది మ్యాచ్’​ దక్కించుకున్నాడు. మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్​లో లక్సెట్టిపేట, హాజీపూర్ టైగర్స్​తలపడ్డాయి. మొదటి బ్యాటింగ్​చేసిన లక్సెట్టిపేట బ్యాటర్లు 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 రన్స్​చేశారు. అనిల్40, మహేశ్​30 రన్స్ చేశారు. అనంతరం చేజింగ్​కు దిగిన హాజీపూర్​బ్యాటర్లు16 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 రన్స్​మాత్రమే చేశారు. లక్సెట్టిపేట ప్లేయర్​రమేశ్​‘ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్’ అందుకున్నాడు.