శివరాత్రికి కాళేశ్వరం ముస్తాబు

శివరాత్రికి కాళేశ్వరం ముస్తాబు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని  కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రంలో  మూడు రోజుల పాటు  జరిగే మహశివరాత్రి ఉత్సవాలకు ఆలయం ముస్తాబైంది. మహారాష్ట్ర , చత్తీస్ ఘడ్  నుంచి అధికంగా భక్తులు  కాళేశ్వరం రానున్న నేపథ్యంలో  పోలీసులు భారీ బందోబస్తును, ఆలయ ఈవో మారుతి  అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

7 న  ఉదయం 10 గంటల కు  దీపారాధన తో కార్యక్రమాలు మొదలవుతాయి.  8 న శివరాత్రి రోజు  కల్యాణం,  రాత్రి 12 గంటలకు మహాభిషేకం , లింగోద్బవపూజ కార్యక్రమాలుంటాయి.  మూడవ రోజు శనివారం  మహన్యాస పూర్వక రుద్రాభిషేకం  అనంతరం పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.  –‌‌ మహదేవపూర్,వెలుగు