హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ మళ్లీ మొదలు కానుంది. కమిషన్చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బుధవారం నుంచి మరో దఫా ఎంక్వైరీని స్టార్ట్ చేయనున్నారు. తాజాగా చేయనున్న ఓపెన్ కోర్టుకు రిటైర్డ్ఐఏఎస్అధికారులకు కమిషన్ సమన్లు ఇచ్చింది. ఇరిగేషన్ శాఖ మాజీ కార్యదర్శులైన రజత్కుమార్, ఎస్కే జోషిని ఎంక్వైరీకి పిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో తీసుకున్న నిర్ణయాలపై ఆ ఇద్దరు అధికారుల నుంచి కమిషన్ వివరాలు రాబట్టనుంది. గురువారం నుంచి మిగతా ఐఏఎస్లకూ సమన్లు పంపి విచారించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. స్మితా సబర్వాల్, రిటైర్డ్ సీఎస్ సోమేశ్కుమార్, ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన రామకృష్ణా రావు తదితరులను విచారణకు పిలిచేందుకు కమిషన్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
