
మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (73) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కిష్టారెడ్డి 1994, 2004 లో కల్వకుర్తి ఎమ్మెల్యే గా పనిచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి, కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి ఎడ్మ కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన మృతికి లువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు.