
హైదరాబాద్: మియాపూర్లో భారీగా డిఫెన్స్ మద్యం పట్టుబడింది. అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం.. మియాపూర్ మాతృశ్రీ నగర్లోని ఓ రేకుల షెడ్లో భారీగా డిఫెన్స్ మద్యం బాటిళ్ల అక్రమ నిల్వ ఉంచినట్లు సమాచారం అందింది.
పక్కా సమాచారం అందటంతో శుక్రవారం (జూన్ 6) రేకుల షెడ్పై రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడి చేశారు. రూ.5 లక్షల విలువ చేసే వివిధ బ్రాండ్లకు సంబంధించిన 160 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. నిందితుడు మన్నవ గాంధీ(65) ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.