
అక్కినేని నాగార్జున చిన్నకొడుకు అఖిల్ పెళ్లి వైభవంగా జరిగింది. శుక్రవారం (జూన్6న) తెల్లవారుజామున 3 గంటలకు తన ప్రియురాలు జైనాబ్ రవ్జీని అఖిల్ పెళ్లాడారు. ఈ సందర్భంగా అక్కినేని వారి వివాహ వేడుకకు సినీ సెలెబ్రెటీలు పెద్దఎత్తున హాజరయ్యారు.
వారిలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు, శర్వానంద్, దర్శక ధీరుడు రాజమౌళి, అతడి కుమారుడు కార్తికేయ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో సుమంత్ సహా తదితరులు హజరై సందడి చేశారు.
ఈ క్రమంలో పెళ్లి అనంతరం జరిగిన బరాత్లో.. అక్కినేని కుటుంబం ఆనందంగా చిందులేసింది. ఓ వీడియోలో పెళ్ళికొడుకు అఖిల్ తన తండ్రి నాగార్జున, అన్న నాగచైతన్యతో కలసి హుషారుగా డ్యాన్స్ చేశాడు.
My Demigod Marriage Vibes 🔥
— King Srinu (@KingSrinu0120) June 6, 2025
King Akhil Chay 🤯
Energy Levels 💥#AkhilWedding #AkhilAkkineni pic.twitter.com/EEIhmEyWy5
ఇంకా చెప్పాలంటే పోయిన సంతోషం.. మళ్ళీ తిరిగొచ్చిందనేలా అక్కినేని ఫ్యామిలీ డ్యాన్స్ చేశారు. అది వారి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నాగార్జున ఆనందం ఐతే మరోలెవల్ అన్నట్టుగా డ్యాన్స్ ఇరగదీశాడు. ఫర్ ది కిల్.. అనే క్యాప్షన్తో బరాత్ డీజేలు మోత మోగేలా డ్యాన్స్ కుమ్మేశాడు.
#AkhilAkkineni ties knot with #Zainab pic.twitter.com/qWI6j6etZ8
— Ramesh Pammy (@rameshpammy) June 6, 2025
వీరితో పాటుగా హీరో సుశాంత్ సైతం డ్యాన్స్తో దుమ్ములేపాడు. ఇలా అక్కినేని వారి పెళ్లి బరాత్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'మళ్ళీ అక్కినేని ఇంటా ఆనందం మెరిసింది. చూడటానికి ముచ్చటగా ఉందంటూ' తమ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
అఖిల్ అక్కినేని-జైనాబ్ వివాహం సంప్రదాయ తెలుగు శైలిలో జరిగింది. తెలుగు సంప్రదాయాలను గౌరవిస్తూ అఖిల్ తెల్లటి కుర్తా మరియు పంచెతో ఆకట్టుకున్నాడు. వధువు జైనాబ్ తెలుపు మరియు బంగారు పట్టు చీరలో వజ్రాల ఆభరణాలతో చాలా అందంగా కనిపించింది. కాగా గతేడాది నవంబర్లో అఖిల్ మరియు జైనాబ్ రవ్ద్జీ నిశ్చితార్థం చేసుకున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత.. నేడు అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో.. అక్కినేని కుటుంబంలో కోలాహలం మొదలైంది.
ఇదిలా ఉంటే.. అఖిల్ రిసెప్షన్ వేడుక ఆదివారం (జూన్ 8న) పెద్దఎత్తున జరగనుంది. ఈ ఈవెంట్కి భారీ సంఖ్యలో సినీ, రాజకీయ, వ్యాపార సహా పలు రంగాల ప్రముఖులు హాజరుకాన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాగార్జున ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారు కూడా వచ్చే అవకాశం ఉంది.
అఖిల్ భార్య జైనాబ్ ముంబైకి చెందిన కళాకారిణి. స్వతహాగా పెయింటింగ్ ఆర్టిస్టు. ఇప్పటికే తన పెయింటింగ్స్తో హైదరాబాద్, ముంబయి, ఢిల్లి, లండన్, దుబాయ్లో ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అంతేకాకుండా సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ఇలా ఆర్టిసుగా రాణిస్తూనే సినిమాల్లో కూడా నటించింది. ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వంలో వచ్చిన 'మీనాక్షి ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్' అనే బాలీవుడ్ మూవీలో ఓ కీలక పాత్రలో జైనాబ్ కనిపించింది