Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేవారికి ఇక పండగే.. శుభవార్త ఏంటంటే..?

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేవారికి ఇక పండగే.. శుభవార్త ఏంటంటే..?

Gold News: భారతదేశంలో బంగారంపై రుణాలకు ఇటీవలి కాలంలో డిమాండ్ క్రమంగా భారీగా పెరుగుతోంది. వాస్తవానికి అత్యవసర సమయంలో వెంటనే రుణం పొందటం కోసం బంగారంపై రుణం అత్యంత సౌకర్యవంతమైనదిగా పరిగణించబడుతోంది. పైగా పర్సనల్ లోన్ కంటే ఇది తక్కువ రేటుకు లభించటం, కొన్ని గంటల్లోనే రుణం లభించంటం దీని ప్రత్యేకత. తాజాగా ఎంపీసీ సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో రిజర్వు బ్యాంక్ గవర్నర్ చేసిన ఒక ప్రకటన గోల్డ్ లోన్స్ తీసుకునేవారిని సంతోషంలోకి నెట్టేస్తోంది. 

వాస్తవానికి బంగారంపై రుణం తీసుకోవాలనుకున్నప్పుడు దాని వాస్తవ విలువలో 75 శాతం మాత్రమే లోన్ రూపంలో అందించటానికి అనుమతి ఉండేది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం విలువలో 75 శాతంగా మాత్రమే రుణం రూపంలో ఇచ్చేందుకు వీలు కల్పించింది. అలాగే ఈ రుణాన్ని 12 నెలల కాల పరమితితో ఇవ్వాలని ప్రకటించింది. కానీ ప్రస్తుతం ఆర్బీఐ లోన్ యూ వాల్యూ రేటును రూ.2.5 లక్షల వరకు 85 శాతానికి సవంరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశంలోని బంగారంపై రుణాలను అందిస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల షేర్లు భారీగా లాభపడ్డాయి. మెుత్తానికి ఆర్బీఐ నిర్ణయం కారణంగా ఇకపై గోల్డ్ లోన్ తీసుకునేవారి చేతికి ఎక్కువ డబ్బు రానుంది. 

►LSO READ | బ్యాంక్ అప్పు ఉన్నోళ్లకు గుడ్ న్యూస్ : తగ్గిన హోమ్ లోన్- పర్సనల్ లోన్ EMI

వివరాల్లోకి వెళితే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లు మధ్యాహ్నం 2.55 గంటల సమయంలో 6.5 శాతం లాభంతో రూ.2వేల 444 వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో మణప్పురం ఫైనాన్స్ కంపెనీ షేర్లు ఒక్కోటి 4.74 శాతం పెరిగి రూ.245.71 వద్ద ట్రేడవుతోంది. ఇదే క్రమంలో ఐఐఎఫ్ఎల్ కంపెనీ షేర్లు ఒక్కోటి 5.08 శాతం పెరిగి రూ.451 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.