మార్చి 3 నుంచి ఎన్నికల ప్రచారం

మార్చి 3 నుంచి ఎన్నికల ప్రచారం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు ప్రచారాలకు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 6న తమిళనాడులో ఎన్నికలు జరగనుండడంతో నెల రోజుల పాటు హోరెత్తించేందుకు సన్నద్ధమవుతున్నారు ఆయా పార్టీల నేతలు.

మక్కల్ నీదిమయ్యం (MNM) పార్టీ అధినేత కమలహాసన్ కూడా ప్రచారానికి  ముహూర్తం ఖరారు చేశారు. మార్చి 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తామని కమల్ తెలిపారు. ప్రస్తుతం పొత్తులపై ఇతర పార్టీలతో చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. పొత్తులు ఖరారు అయ్యాక స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో MNM పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 7న విడుదల చేస్తామని ప్రకటించారు కమల్.