మూత్రం పోయొద్దన్నందుకు కొట్టి చంపారు

మూత్రం పోయొద్దన్నందుకు కొట్టి చంపారు

కామారెడ్డి, వెలుగు : షాపుకు సమీపంలో మూత్రం పోయొద్దన్నందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ యువకుడిపై మరో ఐదుగురు దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..కామారెడ్డిలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్​కు సమీపంలోని ఓ ఫర్నిచర్​షాపు సమీపంలో గత నెల 30న రాత్రి కొందరు యువకులు మూత్రం పోస్తుండగా పోయవద్దని షాపు ఓనర్​ సూర్యకాంతం( 25) కోరాడు.

ఈ విషయంలో మాట మాట పెరగడంతో సదరు యువకులు అక్కడి నుంచి వెళ్లి కొద్దిసేపటికి మరికొందరిని తీసుకువచ్చారు. ఐదుగురు కలిసి సూర్యకాంతంను కర్రలు, ఇటుకలతో తలపై కొట్టారు. తీవ్రంగా గాయపడగా ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్​కు తీసుకువెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు టౌన్​ సీఐ చంద్రశేఖర్​రెడ్డి  తెలిపారు.