కామారెడ్డి, వెలుగు: కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడును కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు కోసం వినతి పత్రం అందజేశారు.
తెలంగాణ రాజధానికి సమీపంగా ఉండడంతో పాటు నేషనల్హైవే, రైల్వే లైన్తో పాటు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు. ఇక్కడ ఫ్లయింగ్ అకాడమి ఏర్పాటు చేయడంతో ఈ ఏరియా అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
