జహీరాబాద్ లో బీజేపీదే గెలుపు : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

జహీరాబాద్ లో బీజేపీదే గెలుపు : కాటిపల్లి వెంకటరమణారెడ్డి
  •     కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు :  జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ గెలుపు ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఆయన ఖేడ్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన విషయంలో ఖేడ్ కు గత ఎంపీలు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ పేదళ్లుగా ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో లేడని, అంతకు ముందు గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు.

సంగారెడ్డి జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే నారాయణఖేడ్ వెనుకబాటు తనానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. పదేళ్లుగాబీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ పథకాలకు రేషన్ కార్డుని తప్పనిసరి చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో మాత్రమే కాంగ్రెస్ గెలిచిందని

దేశంలో ముచ్చటగా మూడోసారి మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీనాయకులు ఆలే భాస్కర్, జైపాల్ రెడ్డి, పైడి ఎల్లారెడ్డి, రవికుమార్ గౌడ్, విజయ్ పాల్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, రజనీకాంత్, సాయిరాం, వెంకట్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.